Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్ ఏడాది పాటు వాయిదా... ఆర్డినెన్స్‌పై ఏపీ హ‌ర్షం

Advertiesment
NEET postponed to one year
, శుక్రవారం, 20 మే 2016 (14:16 IST)
విజ‌య‌వాడ : నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, వెంకయ్య నాయుడుల ప్రత్యేక చొరవ వల్లే నీట్ పైన ఆర్డినెన్స్ జారీ అయ్యింద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీట్ పైన మూడుసార్లు కీలక సమావేశలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ అభ్యర్థనను తెలియజేశారు.
 
తల్లిదండ్రులు, విద్యార్థుల బాధను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి మోదీని ఒప్పించారు. రెండుసార్లు మంత్రి కామినేని స్వయంగా వెళ్ళి, జె.పి.నడ్డా, వెంకయ్యనాయుడు, న్యాయనిపుణులు, ఆధికారులను కలిసి న్యాయం చేయాల‌ని కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రార్థనను కేంద్రం ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాఅని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికలతో బోకో హరమ్ తీవ్రవాదుల బలవంతపు శృంగారం.. గర్భందాల్చుతున్న మైనర్లు