Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరసాపురం వైసీపీలో వర్గ విబేధాలు: కొనసాగుతున్న హైడ్రామా

Advertiesment
Narsapur Municipality
, శుక్రవారం, 30 జులై 2021 (14:46 IST)
నరసాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో సందర్భంగా వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కో ఆప్షన్ సభ్యుల పేర్లను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వర్గం కౌన్సిలర్లు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గం కౌన్సిలర్లు వేర్వేరుగా ప్రతిపాదించారు. 
 
ఎమ్మెల్యే ముదునూరి వర్గం మాజీ కౌన్సిలర్ ఏడిదకోట సత్యనారాయణ అభ్యర్ధిత్వానికి, కొత్తపల్లి వర్గం మాజీ కౌన్సిలర్ బల్ల వెంకటేశ్వరరావుకు మద్దతు ఇచ్చింది. వైసీపీలో వర్గ విబేధాల నేపథ్యంలో ఎన్నిక నిలిచిపోయింది. అటు కౌన్సిల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేతలతో మంతనాలు సాగుతున్నాయి.  
 
కొత్తపల్లి సుబ్బారాయడు 1989లో నర్సాపురం నుంచి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1994, 1999, 2004లో కూడా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు చేతిలో ఓడారు. 
 
2012లో కాంగ్రెస్ నుంచి నర్సాపురం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచారు. 2014లో వైసీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత మళ్లీ టీడీపీలో చేరగా.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. 
 
ఎన్నికలు రావడంతో నర్సాపురం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో మళ్లీ వైసీపీ గూటికి వెళ్లారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ప్రసాదరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు గ్రూపులు కొనసాగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధన్‌బాద్ జిల్లా జడ్జి హత్య : సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు