Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ మహిళలకు ఇచ్చిన పింఛను హామీ ఏమైంది జాదూ రెడ్డి : నారా లోకేశ్

lokesh padayatra
, ఆదివారం, 29 జనవరి 2023 (12:26 IST)
తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్ప నుంచి పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా, ఆదివారం శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసరాల ధరల భారం మోయలేకపోతున్నామని.. పొదుపు సంఘాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం హామీతో జగన్‌ అధికారంలోకి వచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల తాళిబొట్లను సీఎం తాకట్టు పెట్టారని ఆరోపించారు. 
 
మద్యం తయారీ, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని చోట్లా జగన్‌ బినామీలే ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను ఇస్తానన్న హామీ ఏమైందని జాదూ రెడ్డి అని లోకేశ్‌ ప్రశ్నించారు. ఎన్నో ఆంక్షలతో అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. చట్టం లేకుండానే దిశ పీఎస్‌లు, వాహనాలు అంటూ మోసం చేస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎంతమందికి 21 రోజుల్లో ఉరిశిక్ష వేశారని ఆయన నిలదీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకటిన్నర టన్నుల బరువు - రోజుకు 15 లీటర్ల పాలు తాగుతున్న అరుదైన దున్న