Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం రావడం సంతోషంగా ఉంది: నారా బ్రాహ్మణి

హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, బాలయ్య కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హిందూపురం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తాతయ్య, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ,

ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం రావడం సంతోషంగా ఉంది: నారా బ్రాహ్మణి
, సోమవారం, 15 మే 2017 (17:46 IST)
హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, బాలయ్య కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హిందూపురం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తాతయ్య, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణలు ప్రాతినిధ్యం వహించిన హిందూపురంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని బ్రాహ్మణి వెల్లడించారు. 
 
అనంతపురం జిల్లా లేపాక్షిలోని హెరిటేజ్‌ సంస్థ రజతోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. 2022 నాటికి రూ.6వేల కోట్ల టర్నోవరే తమ లక్ష్యమని చెప్పారు. ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు అందిస్తామని.. హెరిటేజ్ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఎస్ఎస్‌లో చేరిన 700మంది ముస్లింలు.. పారికర్, యోగి ఎప్పుడు రాజీనామా చేస్తారు?