Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఐరెన్ లెగ్' రోజా అడుగుపెట్టిందో కాలు తీసేస్తాం.. నంద్యాల 16వ వార్డు మహిళల వార్నింగ్

కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల పట్టణంలోని 16వ వార్డులో ఆమె ప్రచారానికి వెళ్లగా స్థానిక మహిళల నుంచి తీవ్ర ప్ర

'ఐరెన్ లెగ్' రోజా అడుగుపెట్టిందో కాలు తీసేస్తాం.. నంద్యాల 16వ వార్డు మహిళల వార్నింగ్
, శనివారం, 5 ఆగస్టు 2017 (14:21 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజాకు చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల పట్టణంలోని 16వ వార్డులో ఆమె ప్రచారానికి వెళ్లగా స్థానిక మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐరెన్ లెగ్ రోజా తమ వార్డులో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆ వార్డు ప్రజలు భీష్మించికూర్చొన్నారు. దీంతో ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
శనివారం ఉదయం రోజా ఎన్నికల ప్రచారం చేస్తుండగా నియోజకవర్గంలోని 16వార్డులో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. తమ వార్డులోకి అడుగుపెట్టిందంటే తగినశాస్తి చేస్తామంటూ హెచ్చరించారు. ముఖ్యంగా.. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతగా మీరు ఎందుకు స్పందిచట్లేదని నిలదీశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
 
పైగా, రోజా డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. తమ ప్రతిఘటనను మీరి వార్డులో ప్రచారం చేస్తే సహించే ప్రసక్తేలేదంటూ వారు హెచ్చరించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రోజాకు నచ్చజెప్పి ప్రచారం చేయకుండా చేశారు. ఆ తర్వాత రోజా ప్రచారం ముగించుకుని వైసీపీ కార్యాలయానికి వెళ్లడంతో గొడవ సర్దుమనిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరులో దారుణం... టెంపో - కంటైనర్ ఢీ.. ఆరుగురి దుర్మరణం