Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో 2024 ఎన్నికలు.. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి నాగార్జున?!

Nagarjuna
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:01 IST)
ఏపీలో 2024లో జరుగనున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నాయి. ఏపీలో ఇంకా ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడానికి పావులు కదుపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కొద్దిమందికి అభయమివ్వగా మరికొంత మందికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
ఇదే కోవలో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ ఎంపీగా పోటీలో దింపేందుకు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 
 
2014, 2019లో వైసీపీ అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్‌లు విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
 
రాబోయే 2024లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసీపీ పెద్దలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నాగార్జున పేరును కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థలు హవా - టాప్50లో 8 మంది