Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ సోదరి షర్మిల వల్లే మా అమ్మ శోభ చనిపోయింది... అఖిల ప్రియ

నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్ర

జగన్ సోదరి షర్మిల వల్లే మా అమ్మ శోభ చనిపోయింది... అఖిల ప్రియ
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (20:35 IST)
నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన తల్లి శోభానాగిరెడ్డి ఎందుకు మరణించారు... ఆమె మరణానికి కారణం జగన్ సోదరి షర్మిల కాదా అని ప్రశ్నించారు. షర్మిల కోసం వెళ్లిన తన తల్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సంగతి వారికి తెలియదా అని అన్నారు. 
 
శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ఫోటోను పెట్టుకుని రావడం లేదా అని ప్రశ్నించారు. ఆయనలా తన తండ్రి గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ నేను నా తల్లిదండ్రుల గురించి చెబితే తప్పా అని ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్నారంటే... మంత్రి అచ్చెన్న ఆవేదన