Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు భద్రత పెంచండి... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ

చంద్రబాబుకు భద్రత పెంచండి... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ
విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:04 IST)
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపైనే దాడికి ప్రయత్నించారని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఈ ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని, దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేద‌ని, ఉల్టా తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశార‌ని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే, ఈ ఘటన జరిగిందని వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపార‌ని క‌న‌క‌మేడ‌ల వివ‌రించారు. ఈ దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామ‌ని, ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామ‌ని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాఠశాలలు ఎప్పుడు తెరవాలో రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చెప్పబోము: సుప్రీంకోర్టు