Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప రాష్ట్ర‌ప‌తి ప‌క్క‌నే ఉన్నార‌ని ప‌వ‌న్ తో స్టేజీపై మాట్లాడ లేదు...

ఉప రాష్ట్ర‌ప‌తి ప‌క్క‌నే ఉన్నార‌ని ప‌వ‌న్ తో స్టేజీపై మాట్లాడ లేదు...
విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (12:39 IST)
తాము ఎంతో నిజాయితీగా మా ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ ప్రకాష్ రాజ్ సి.సి.ఫుటేజ్ తీసుకున్నా ఉపయోగం లేద‌ని, తాము నిజాయితీగానే గెలిచాం అని విష్ణు వివ‌రించారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయక ముందే నాదే గెలుపని ప్రకాష్ రాజ్ నాతో కరచాలనం చేశార‌ని, ఆయ‌న ఏం చేశారో సిసి ఫుటేజ్ లో నిక్షిప్తం అయి ఉంద‌ని విష్ణు చెప్పారు. పృథ్వీ ఆరు ఓట్లతో ఓడిపోవడంతో తాను బాధపడ్డాను అని అన్నారు. చిరంజీవి త‌మ‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, మా నాన్న మోహ‌న్ బాబుతో చిరంజీవి మాట్లాడార‌న్నారు. అలాగే అలై బ‌లైలో పవన్ కళ్యాణ్ తో స్టేజ్ కింద మాట్లాడాన‌ని, ఉప రాష్ట్రపతి ఉండడం వల్ల స్టేజ్ పై మాట్లాడుకోలేద‌ని మంచు విష్ణు వివ‌ర‌ణ ఇచ్చారు. 
 
పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తించాలని ఈయనెవరో తెలుసా అంటూ ట్వీట్ చేశాన‌ని, అలాగే, 
వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చు అని తెలిపారు. మా అసోసియేషన్ లో జర్నలిస్టు కొండేటి సురేష్ ఉన్నార‌ని, జర్నలిస్టు నటుడు ఎలా అవుతాడ‌ని విష్ణు ప్ర‌శ్నించారు. నటులే మా అసోసియేషన్ సభ్యులుగా ఉండాలని బైలాస్ ను తీసుకొస్తామ‌ని మీడియాకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందూపురంలో బాలయ్య... GGHలో ఆకస్మిక తనిఖీ