Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అష్టా చెమ్మా.. పేకాటలతో కరోనా వ్యాప్తి.. 17మంది పాజిటివ్

అష్టా చెమ్మా.. పేకాటలతో కరోనా వ్యాప్తి.. 17మంది పాజిటివ్
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (17:50 IST)
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్లల్లోనే వుండిపొమ్మంటే.. జనాలు గుంపుగా అష్టా చెమ్మా, పేకాట, క్యారంబోర్డులు ఆడుతూ గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా సులభంగా వ్యాపిస్తోంది. ఇటీవల సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచెమ్మ ఆడి 31 మందికి కరోనాను అంటించింది. తాజాగా విజయవాడలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి మరికొంత మందికి అంటించాడు.
 
కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్య వీధిలో ఓ లారీ డ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. అతడు ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. వచ్చిన వెంటనే తన స్నేహితులతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం అతడు తీవ్ర జ్వరంతో బాధపడగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడితో పేకాడిన వారికీ పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేశారు అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు. మరికొందరిని కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌లో తెలుగు విద్యార్థులు.. బిస్కెట్లు తిని బతుకుతున్నారు..