Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారానికి నిరాకరించిందనీ ప్రియురాలి కుమారుడిని చంపేశాడు...

ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ప్రియురాలు నిరాకరించడంతో ఆమె కుమారుడిని దారుణంగా హత్యచేశాడు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌, నెసపక్కాంలో ఈ దారుణం జరుగగా, తాజా

Advertiesment
chennai
, శుక్రవారం, 2 మార్చి 2018 (12:54 IST)
ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ప్రియురాలు నిరాకరించడంతో ఆమె కుమారుడిని దారుణంగా హత్యచేశాడు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌, నెసపక్కాంలో ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నెసపాక్కం ప్రాంతానికి చెందిన కార్తికేయన్‌ (37), మంజుల (36) దంపతులకు నితీష్‌సాయి అనే పదేళ్ల కుమారుడు ఉన్నాడు. మంజులకు కార్తికేయన్‌ రెండోభర్త. మొదటి భర్త మరణించడంతో అతని ప్రభుత్వ ఉద్యోగం మంజులకు వచ్చింది. అయితే, మంజులకు అదేప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్న నాగరాజ్‌తో వివాహేతర సంబంధం ఉంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక అతన్ని దూరంగా పెట్టసాగింది. దీంతో మంజులపై కక్ష పెంచుకున్న నాగరాజ్... ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు.
 
గురువారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన నితీష్‌ సాయి రాత్రి 9.30 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కార్తికేయన్‌ ట్యూషన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లాడు. కుటుంబ స్నేహితుడైన నాగరాజ్‌ (27) బాలుడిని తీసుకెళ్లినట్లు టీచర్‌ తెలిపింది. ఎంతవెతికినా బాలుడు కనిపించకపోవడంతో కార్తికేయన్‌ ఎంజీఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై నాగరాజ్‌ను పోలీసులు పిలిచి మందలించి వదిలివేశారు. 
 
అయితే, మంజుల ఆ తర్వాత కూడా నాగరాజ్‌తో సంబంధాన్ని కొనసాగించింది. కానీ, కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మంజుల నాగరాజ్‌కు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని నాగరాజ్‌ ప్రియురాలితో గొడవపడుతూ వచ్చాడు. ఎంతకూ మాట వినకపోవడంతో ఉన్మాదిలా మారిన నాగరాజ్‌ ఆమె బిడ్డను హతమార్చాడు. ఈ కేసులో నాగరాజ్‌తో పాటు.. మంజులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ - షా ద్వయం ఉచ్చులో చంద్రబాబు : జేసీ దివాకర్ రెడ్డి