Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 27ఏళ్ల వ్యక్తి మృతి

Egg fried rice
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:30 IST)
Egg fried rice
ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని.. బయటి ఆహారం వర్షాకాలంలో తీసుకోవద్దని ఎన్ని నీతులు చెప్పినా.. టేస్ట్ కోసం జనం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల వెంట తిరుగుతున్నారు. దీంతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పట్లేదు. 
 
నిన్నటికి నిన్న షవర్మా తిని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని ఓ 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి రూరల్ కాలూరులో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. ఆపై అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మేక్ ఇన్ ఇండియా" ఐఫోన్ 15 కొనుగోలుదారులకు జియో సూపర్ ఆఫర్లు