Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమ్ముడి ఇంటికి భార్య వెళ్లిందనీ సజీవదహనమైన భర్త.. ఎక్కడ?

తమ్ముడి ఇంటికి భార్య వెళ్లిందనీ సజీవదహనమైన భర్త.. ఎక్కడ?
, సోమవారం, 2 మే 2016 (17:16 IST)
ప్రకాశం జిల్లా తాళ్ళూరులో దారుణం జరిగింది. వద్దని చెపుతున్నా తన భార్య ఆమె సోదరుని ఇంటికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాళ్లూరులోని ఎస్సీ కాలనీకి చెందిన ముంతా చిన అంజయ్య (29) గ్రామంలోని రాముల వారి మేడ వద్ద కుట్టు మిషన్‌పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. చిన అంజయ్య భార్య లలిత. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, లలిత తన తమ్ముడు పెళ్లికి పొదిలి మండలం గంజిపాలెం వెళ్లింది. పెళ్లి ముగించుకుని ఇంటికి రాకుండా తమ్ముడు నివాసముండే జబల్‌పూర్‌కు వెళుతున్నట్లు భర్తకు సమాచారం చేరవేసింది. దీనికి అతను వద్దని చెప్పాడు. అయితే, బంధువులంతా పట్టుబట్టడంతో ఆమె వెళ్లకతప్పలేదు.
 
దీన్ని తీవ్ర అవమానంగా భావించిన అంజయ్య... తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద కిరోసిన్‌ వంటిపై పోసుకుని నిప్పంటించున్నాడు. చుట్టుపక్కలవారు మంటలను చల్లార్చే ప్రయత్నం చేసిపన్పటికి శరీరం అధికభాగం కాలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వి.మహేష్‌ సంఘటనా స్థలాన్ని చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్ భర్త రాసలీలలు... ఇంటికే ప్రియురాలిని తెచ్చుకుని... రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన శ్రీమతి...