Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Advertiesment
Bus Fire

సెల్వి

, గురువారం, 6 నవంబరు 2025 (10:03 IST)
Bus Fire
విశాఖపట్నం నుండి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో మంటల్లో చిక్కుకోవడంతో జరగబోయే విషాద సంఘటన తృటిలో తప్పింది. గురువారం ఉదయం ఒడ్డవలస గ్రామంలో ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తత కారణంగా, బస్సును వెంటనే ఆపేశారు. 
 
భయాందోళనకు గురైన ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి వీలు కల్పించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సకాలంలో తీసుకున్న చర్య వల్ల పెద్ద విపత్తు తప్పింది. ప్రయాణికులు కిందకు దిగిన కొన్ని క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి, చూస్తుండగానే కాలిబూడిదైంది.
 
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు