Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి పేరు పెట్టిన ఏపీ సర్కార్

Machilipatnam Medical College

సెల్వి

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:00 IST)
Machilipatnam Medical College
మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలగా పేరు మార్చింది. పేరు మార్పుకు సంబంధించి ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
మచిలీపట్నంలోని ప్రజలు, రాష్ట్రంలోని ఇతర స్వాతంత్ర్య సమరయోధులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతి అభివృద్ధికి పాటుపడిన పింగళి వెంకయ్యకు ఇదే సముచిత నివాళి అని అన్నారు. 
 
కళాశాల పేరు మార్చడం మచిలీపట్నంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. పింగళి స్వాతంత్ర్య సమరయోధులు, భారత జాతీయ జెండా రూపకర్తగా అందరికీ తెలిసిందే. 
 
కళాశాల పేరును మార్చడం ద్వారా గొప్ప స్వాతంత్ర్య సమరయోధుని సేవలను గుర్తించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, టిడిపి, జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్‌లోని ఐటీ ఉద్యోగులకు ఫ్రీ బస్సు సర్వీసులు.. ఎక్కడ నుంచో తెలుసా?