Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడికి యత్నం?

ఏపీ మంత్రి పేర్ని నానిపై తాపీతో దాడికి యత్నం?
, ఆదివారం, 29 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై కార్మికులు, రోజువారీ కూలీల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం, వారికి ఉపాధి లేకపోవడమే. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇసుక కంటికి కనిపించకుండా పోయింది. దీంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. అనేక మంది భార్యాపిల్లలను పోషించలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. 
 
దీంతో అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తాం : బండి సంజయ్