Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణం... ఏపీకి అల్పపీడనం తప్పినట్టే!

Advertiesment
తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణం... ఏపీకి అల్పపీడనం తప్పినట్టే!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (10:22 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో మ‌ళ్ళీ తుపాను వ‌స్తుంద‌ని జ‌నం బెంబేలుప‌డుతున్నారు. అయితే, ఆ ముప్పు త‌ప్పిన‌ట్లే అని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ వారు తెలియ‌జేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 
దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంద‌ని  విశాఖ వాతావ‌ర‌ణ శాఖ వారు తెలియ‌జేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్‌బీ ఫ్రెండ్‌తో ఎస్సై పరీక్షలకు వెళ్తే... కారులోనే ఎంత పనిచేశాడంటే?