Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహితతో ప్రేమ.. రైలు ముందు నిల్చుని ప్రేమికుల ఆత్మహత్య..

వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్

Advertiesment
lovers
, ఆదివారం, 19 మార్చి 2017 (12:00 IST)
వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన మండవ వినయ్ అనే యువకుడు గుంటూరు జిల్లాలోని వినుకొండలో స్టీల్ సామాన్లు విక్రయించేవాడు. వినుకొండలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉండేవాడు.
 
ఈ క్రమంలోనే వినుకొండకు చెందిన ఎస్కే జీనత్‌తో పరిచయం ఏర్పడింది. జీనత్‌కు చిన్నతనంలోనే సైదుల్లా అనే వ్యక్తితో పెళ్లాడింది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు. అయినా వినయ్‌కు జీనత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
రెండు రోజుల క్రితం వారిద్దరూ వినుకొండను వదిలేసి నెల్లూరుకు వచ్చారు. అయితే శనివారం నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. ఇద్దరూ రైలు ముందు నిల్చుని ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో కోక్ జీరో అమ్మకాలపై ఎఫ్‌డీఏ నిషేధం.. ట్రంప్ వద్దు ఒబామానే కావాలి..