Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

Liquor Price: సంక్రాంతికి మందుబాబులకు ఫుల్ కిక్కు.. రూ.99లకే క్వార్టర్‌ మద్యం

Advertiesment
liqour

సెల్వి

, మంగళవారం, 14 జనవరి 2025 (15:40 IST)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని చంద్రబాబు సర్కారు కొత్త మద్యం విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రూ.99లకే క్వార్టర్‌ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం వైన్స్‌లలో రూ.99లకే క్వార్టర్‌ లభించింది. దీంతో ప్రజలు మందు కిక్కులో మునిగారు. దీనికి తోడు సంక్రాంతికి మద్యం ధరలను తగ్గించింది. భోగి రోజే మద్యం ధరలు భారీగా తగ్గించింది. 
 
కోడిపందాలతోపాటు మద్యంలో ప్రజలు మునిగితేలేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గడంతో ఫుల్‌ కిక్కు ఇట్టే తగ్గించారు. దీంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. 
 
కాగా మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించడంతో తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా ప్రారంభమైంది. ఏపీలో రూ. 99లకే క్వార్టర్‌ మద్యానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మద్యం విక్రయాలు జోరందుకోవడంతో మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటుకు మద్యం అందిస్తామని ముందుకువస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత... దీనికి తోడు వర్షాలు.. ఐఎండీ వార్నింగ్