Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుతో ఆంధ్రా ఆక్టోపస్‌‌ భేటీ ఎందుకు? రాజకీయాల్లోకి రీ ఎంట్రీ?

రాజకీయ జోస్యాలతో ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించుకున్న లగడపాటి రాజగోపాల్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన లగడపాటి వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబుతో దాదాపు 40 న

Advertiesment
Lagadapati Rajgopal
, శనివారం, 15 ఏప్రియల్ 2017 (09:53 IST)
రాజకీయ జోస్యాలతో ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించుకున్న లగడపాటి రాజగోపాల్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన లగడపాటి వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

లగడపాటి ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చాలా బాగుందని, తాత్కాలిక సచివాలయమే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక శాశ్వత సచివాలయం ఏ స్థాయిలో నిర్మిస్తారోనని బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
ఏ పార్టీకి దగ్గరైతే రాజకీయ భవిష్యత్తుకు మంచిదో సొంత సర్వే చేయించుకున్న లగడపాటి.. టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాగా తెలంగాణ ఏర్పాటు అనంతరం రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన లగడపాటి మాట నిలబెట్టుకున్నారు. కానీ లగడపాటి రాజకీయాలపై మొగ్గుచూపుతున్నారు.

మరి చంద్రబాబుతో భేటీ ద్వారా టీడీపీకి దగ్గరవుతారా? లేకుంటే బీజేపీ ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు"... నారా లోకేష్ బ్లండర్ మిస్టేక్