Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుచి చూపించి దూరం పెట్టిందనీ... అంతం చేశాడు..

రుచి చూపించి దూరం పెట్టిందనీ... అంతం చేశాడు..
, మంగళవారం, 9 మార్చి 2021 (13:37 IST)
తనతో వివాహేతర సంబంధం కొనసాaగిస్తూ వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్టుండి దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా గ్రామంలో తిరుగుతూ వచ్చాడు. అయితే, వారం రోజుల తర్వా అతని బండారం బయటపడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్యాపిలి మండల పరిధిలోని నల్లబల్లి గ్రామ శివార్లలో యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30)కు బోయవాండ్లపల్లె గ్రామానికి చెందిన రామ్మోహన్‌తో 15 యేళ్ళ క్రితం వివాహం జరిగింది. 
 
వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. అయితే అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం రామ్మోహన్‌ మృతి చెందాడు. దీంతో పుట్టింటికి చేరుకున్న రాధమ్మ స్వగ్రామంలోనే చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. 
 
ఈ క్రమంలో ఆమెకు అదేగ్రామానికి చెందిన ధనుంజయులు అలియాస్‌ అంజితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో రాధమ్మ కొద్ది రోజులుగా అంజికి దూరంగా ఉంటోంది.
 
దీన్ని జీర్ణించుకోలేక పోయిన అతను నల్లబల్లి గ్రామానికి చెందిన తన మిత్రుడు రంగస్వామితో కలసి రాధమ్మను హతమార్చాలని పథకం రచించాడు. వారిరువురూ కలిసి ఆమెను పొలాల వద్దకు తీసుకుని వెళ్లి రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 
 
శవాన్ని కనిపించకుండా చేసేందుకు గుట్టలో పెద్ద బండ రాళ్ల మధ్య ఇరుకైన సందులోకి ఇరికించారు. వారం రోజుల తర్వాత శవం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్వాసన వ్యాపించింది. దీంతో సమీప పొలాల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొడతావా? నువ్వేం మనిషివి..? సుప్రీం కోర్టు ఫైర్