Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలులో దారుణం: పసికందు.. హృదయవిదారక స్థితిలో.. గుక్కపట్టి ఏడుస్తూ..

కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. పసికందు కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు మృగాల్లా ప్రవర్తించారు. మానవత్వాన్ని మంటగలిపేశారు. పసికందు కాళ్లూచేతులు మెలితిప్పి విరిచేశారు. ఆపై ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వ

Advertiesment
కర్నూలులో దారుణం: పసికందు.. హృదయవిదారక స్థితిలో.. గుక్కపట్టి ఏడుస్తూ..
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (10:45 IST)
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. పసికందు కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు మృగాల్లా ప్రవర్తించారు. మానవత్వాన్ని మంటగలిపేశారు. పసికందు కాళ్లూచేతులు మెలితిప్పి విరిచేశారు. ఆపై ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఆసుపత్రిలో ప్రభుత్వాసుపత్రి వద్ద ఓ పసికందు హృదయవిదారక స్థితిలో, గుక్కపట్టి ఏడుస్తూ స్థానికుల కంటబడింది. దీంతో వారు ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు. 
 
అత్యంత పాశవికంగా ఆ పసికందు బాలిక కాళ్లు, చేతులు విరిచేశారని వైద్యులు నిర్ధారించారు. ఆ బాధ తాళలేక బాలిక ఏడుస్తోందని చెప్పారు. నియోనేటల్ ఐసీయూలో చేర్చిన వైద్యులు పసికందుకు చికిత్స అందిస్తున్నారు. ఇంత రాక్షత్వానికి పాల్పడ్డది ఎవరు? అన్న దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ పుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. 
 
శిశుగృహ మేనేజర్‌ మెహతాజ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పసిబిడ్డను పరిశీలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్‌ఐసీయూలో చేర్పించారు. బాలల సంక్షేమ కమిటీ ఉత్తర్వుల మేరకు శిశువు తమ ఆధీనంలో ఉన్నట్లు ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎన్నికల్ని రద్దు చేయండి.. విజేతగా ప్రకటించండి..