Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయ విశ్లేషకుడు 'కుండబద్ధలు' సుబ్బారావు ఇకలేరు

subba rao
, సోమవారం, 2 జనవరి 2023 (16:26 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండబద్ధలు సుబ్బారావుగా గుర్తింపు పొందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ వచ్చిన ఆయనను ఆదివారం ఆస్పత్రిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు సంతాపం తెలిపారు. 
 
కాగా, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కుండబద్ధలు సుబ్బారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ పోలీసులు నోటీసులు కూడా పంపించారు. ఈ విచారణకు వెళ్లకుండానే ఆయన కన్నమూశారు.
 
కాటా సుబ్బారావు మృతితో ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. కాగా, ఈయన కుండబద్ధలు అనే యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తూ ప్రభుత్వ తప్పొప్పులను విశ్లేషిస్తూ గుర్తింపుపొందారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు తొక్కిసలాట తర్వాత ఆస్పత్రికి మంత్రులు క్యూ కట్టారు.. కుట్ర ఉండొచ్చు : అచ్చెన్న