Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమించుకున్నారు.. చివరికి పెట్రోల్ పోసుకుని?

వరుసకు అన్నాచెల్లెళ్లు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని బాంబు పేల్చారు. చివర

Advertiesment
krishna
, ఆదివారం, 28 జనవరి 2018 (11:18 IST)
వరుసకు అన్నాచెల్లెళ్లు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని బాంబు పేల్చారు. చివరికి ఏం చేయాలో తోచక.. కలిసి బతకలేక, విడిపోలేక ఆ ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. శివాపురానికి చెందిన సాయి(19), నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఎల్‌బీ తండకు చెందిన సునీత(18)తో ప్రేమలో పడ్డాడు. తమకు పెళ్లి చేయాలంటూ ఇద్దరూ పెద్దలపై ఒత్తిడి చేశారు. వీళ్లిద్దరికీ వరుస కుదరదని కుటుంబీకులు, బంధువులు తేల్చిచెప్పారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన ఈ జంట.. తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ జంట స్వగ్రామానికి చేరుకోగానే పెద్దలంతా పంచాయతీ పెట్టారు. 
 
అయితే సునీతను చూడలేకుండా సాయి వుండలేకపోయాడు. సునీత కూడా సాయికి దూరంగా వుండలేకపోయింది. దీంతో ఈ జంట పెనుగంచిప్రోలులోని సుబాబుల్ తోటలోకి వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఈ జంట పరిస్థితి విషమంగా వుందని వైద్యులు నిర్ధారించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోక్లామ్‌ వద్ద చైనా దూకుడు.. భారత్ చర్యలు భేష్.. అమెరికా