Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అచ్చెన్నకు బెయిల్ మంజూరు.. రేపు విడుదల

అచ్చెన్నకు బెయిల్ మంజూరు.. రేపు విడుదల
, సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:41 IST)
పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో  నిమ్మాడలో జరిగిన ఓ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన మంగళవారం జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నకు ఫిబ్రవరి 2న కోటబొమ్మాలి కోర్టు రిమాండ్ విధించింది. అచ్చెన్నాయుడుతో పాటు 21 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేసింది. రేపు జైలు నుంచి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు.
 
అచ్చెన్నాయుడు సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే వైకాపా పోటీకి దించేందుకు వ్యూహాన్ని రచించింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. 
 
కానీ, పోలీసులు మాత్రం అచ్చెన్నాయుడుపై బెదిరించినట్టుగా కేసు నమోదు చేశారు. అదేసమయంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ హల్ చల్ చేశారు. నేరుగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. 
 
రోడ్లపైకి భారీ ఎత్తున వచ్చిన వైకాపా కార్యకర్తలు నడిచి బీభత్సం సృష్టించారు. అయితే వారెవరిపైనా కేసులు నమోదు చేయలేదు. అచ్చెన్నాయుడుపై మాత్రం కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే అచ్చెన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోయిస్టు ప్రభావిత గ్రామంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు