Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదినతో మరిది రొమాన్స్... పిల్లలు అడ్డుగా ఉన్నారనీ...

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది.

Advertiesment
east godavari
, బుధవారం, 26 జులై 2017 (08:49 IST)
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది. వదినతో తాను అనుకున్నపుడు ఏకాంతంగా గడిపేందుకు చిన్నారుల వల్ల వీలుపడక పోవడంతో ఇద్దరు చిన్నారుల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి వారిద్దరినీ కాలువలో తోసేసి చంపేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకరపు చిన్నారావు, మంగ దంపతుల కుమారులైన ప్రశాంత్‌(10), విక్కీ(8) ఆదివారం ఉదయం పాలు తేవడానికి వెళ్లారు. అయితే, ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన వరసకు బాబాయ్‌ అయిన కైకరపు రవిశేఖర్‌ ఆదివారం ఉదయం మోటార్‌ సైకిల్‌ పై ఎక్కించుకుని పోలవరం వైపునకు తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించగా, అసలు విషయం తెలిసింది. 
 
చిన్నారుల తల్లి మంగతో తనకు వివాహేతర సంబంధం ఉందనీ, ఆమెతో తాను అనుకున్నప్పుడల్లా ఏకాంతంగా గడిపేందుకు చిన్నారులు అడ్డుగా ఉండటంతో వారిని అడ్డుతొలగించుకునే క్రమంలో నీటి కాలువలో తోసేసి హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ అత్యాశకు ఫలితం ఇదా.. మన బంకులు వెలవెల.. వాళ్ల బంకులు కళకళ