Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చోరీ కేసులో జైలు శిక్ష: కంది కారాగారంలో ఫినాయిల్ తాగి ఖైదీ ఆత్మహత్య..

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కారాగారంలో ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇతడు ఫినాయిల్ తాగడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం అందించారు. అ

చోరీ కేసులో జైలు శిక్ష: కంది కారాగారంలో ఫినాయిల్ తాగి ఖైదీ ఆత్మహత్య..
, బుధవారం, 11 జనవరి 2017 (15:54 IST)
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కారాగారంలో ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇతడు ఫినాయిల్ తాగడాన్ని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం సింగారం గ్రామానికి చెందిన కరుణాకర్‌ (20) అనే ఖైదీకి 2016 సంవత్సరంలో చోరీ కేసులో శిక్ష పడింది. ఇతడు కంది జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం ఉదయం కరుణాకర్‌ ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
గమనించిన తోటి ఖైదీలు విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. దీంతో జైలు అధికారులు అతనిని సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్‌ మృతి చెందాడని సంతోష్‌కుమార్‌ రాయ్‌ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం మిస్టరీ వీడింది. కాకతీయ కాలువలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన విద్యార్థినులు కాలువలో శవాలై తేలారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత ఆస్తులను జాతికి అంకితం చేయాలి.. మద్రాస్ హైకోర్టులో పిల్.. వారసులు లేరట..