Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖబడ్దార్ విష్ణువర్థన్ రెడ్డి : మాజీ మంత్రి జవహర్

ఖబడ్దార్ విష్ణువర్థన్ రెడ్డి : మాజీ మంత్రి జవహర్
, శనివారం, 2 జనవరి 2021 (20:10 IST)
చంద్రబాబు ఆలయాలు కూర్చుతున్నారని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని, అప్పుడు విష్ణువర్థన్ రెడ్డి ఏ కలుగులో ఉన్నారని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ విమర్శించారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు విష్ణువర్థన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశం పంపారు. టీడీపీ బాధ్యతగా వ్యవహరిస్తుందని, హైందవ ముసుగులో జగన్ రెడ్డి భజన విష్ణువర్థన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ఖబడ్దార్..నీ మాటలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మట్లాడితే ప్రజలు శిక్ష వేస్తారని, ఏ ప్రయోజనం ద్వారా చంద్రబాబును విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.

హైందర రక్షకుడిగా జగన్..ఆలయాలు కూల్చేవాడిలా చంద్రబాబు మీకు కనబడుతున్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను కాపాడింది టీడీపీనే అన్ని మతాలను గౌరవించేది ఒక్క టీడీపీనే అన్న మాట గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇక లేనట్లేనా?