Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం

చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:17 IST)
నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా అనేకమంది డెలిగేట్స్ ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అమరావతికి చేరుకున్నారు.
 
అలాగే టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధులు కూడా ఈ సదస్సు కు రానున్నారు. శుక్రవారం కవిత అమరావతికి చేరుకుని సదస్సులో పాల్గొంటారు. అమరావతి పర్యటన సందర్భంగా కవిత విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం. ఈ సదస్సులో ఏపీకి చెందిన మంత్రులతో పాటు, కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సదస్సులో పాల్గొంటారు. 
 
కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, నాలుగు రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరు కానున్నారు. శ్రీలంక ప్రథమ మహిళ మైత్రేయి విక్రమసింఘె, అమెరికా చట్ట సభ ప్రతినిధి అరుణ్‌మిల్లర్‌, కెన్యా నుంచి నలుగురి రాక ఖరారైందని సమాచారం. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొంటారు. దీంతో కవిత.. బ్రాహ్మణితో కలిసి వేదిక పంచుకుంటారా అనేది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోల్డెన్ బే రిసార్ట్‌‌లో ఎమ్మెల్యేల ఎంజాయ్‌మెంట్.. పన్నీర్ వెంట పోతారా? చిన్నమ్మకు ఓటేస్తారా?