Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటకలో పోలీసుల అదుపులో ఏడుగురు భర్తల భార్య

పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది.

కర్నాటకలో పోలీసుల అదుపులో ఏడుగురు భర్తల భార్య
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:16 IST)
పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె మూడో భర్త ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి రాగా, దేశవ్యాప్తంగా మీడియాలో కవరేజ్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల అరెస్టు తర్వాత, ఆమెను విచారించగా, తాను తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకున్నానని, మరెవరినీ పెళ్లి చేసుకోలేదని చెప్పినట్టు సమాచారం.
 
కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇమ్రాన్‌ను బెదిరించి రూ.10 లక్షలతో ఉడాయించిన యాస్మిన్, ఆపై డబ్బున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లి పేరుతో మోసం చేసి, కొంత కాలం కాపురం చేశాక, వారిని బెదిరించి డబ్బుతో పారిపోయేదని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొన్నం ప్రభాకర్ ఆమె కాళ్లుపట్టుకున్నారా.. జైపాల్ రెడ్డి స్పందన ఏంటి?