Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజావి కులదురహంకార వ్యాఖ్యలే.. అనిత ఫిర్యాదు చేస్తే..?: కారెం శివాజీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు కష్టాలు తీరేలా లేవు. ఓవైపు సస్పెన్షన్ వేటు వేసే దిశగా కమిటీ నివేదిక ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ రోజాపై శివా

Advertiesment
Karem Sivaji
, సోమవారం, 20 మార్చి 2017 (14:57 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు కష్టాలు తీరేలా లేవు. ఓవైపు సస్పెన్షన్ వేటు వేసే దిశగా కమిటీ నివేదిక ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ రోజాపై శివాలెత్తారు. అసెంబ్లీలో రోజా దళిత ఎమ్మెల్యే అనితపై దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ విషయంలో అనిత కమిషన్ ముందుకు సాక్ష్యాధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే అసెబ్లీ స్పీకర్ సహకారంతో రోజాపై విచారణ చేపడతామని శివాజీ తెలిపారు. 
 
ఎమ్మెల్యే అనితను ఉద్ధేశించి రోజా చేసిన వ్యాఖ్యలు కులదురహంకర మైనవని, ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివాజీ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో దళితుల సంక్షేమ రంగానికి 15 శాతం మేర నిధులు పెంచారని, నిరుద్యోగ భృతికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు గతంలో రూ.20వేలు ఇచ్చేవారని.. ఆ మొత్తం ప్రస్తుతం ప్రభుత్వం రూ.40వేలకు పెంచిందని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన