Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాణిపాకంలో కరోనా.. భక్తులకు అనుమతి లేదు..

కాణిపాకంలో కరోనా.. భక్తులకు అనుమతి లేదు..
, సోమవారం, 15 జూన్ 2020 (11:58 IST)
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి భక్తులు అనుమతిని నిషేధించారు. కారణం కరోనా.. కాణిపాకం ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. కాణిపాకం ఆలయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... ఆలయ నిర్వాహకులు, ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు చేయించారు. 
 
వాటి రిపోర్టులు తాజాగా వచ్చాయి. వారిలో ఒకరికి కరోనా వున్నట్లు తేలింది. భక్తులు అన్ని విధాలా సామాజిక దూరం పాటించేలా చేశారు. మాస్కులు తప్పనిసరి చేశారు. కానీ సిబ్బందికి కరోనా సోకడంతో ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులు... కాణిపాకం వినాయక స్వామిని కూడా దర్శించుకుంటారు. ఓ బావిలో దొరికిన వినాయక మూల విరాట్టు విగ్రహం... క్రమంగా సైజు పెరుగుతోంది. ఏళ్లు గడిచేకొద్దీ సైజు పెరుగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట విగ్రహం కింద ఉండే ప్లేటు చిన్నదై పగిలిపోవడంతో... దాన్ని తొలగించి పెద్ద ప్లేటు ఉంచారు. ఆ ఆలయ విశిష్టతల్లో ఇదీ ఒకటి. 
 
అందువల్లే తిరుమల దర్శనం తర్వాత... చాలా మంది కాణిపాకం వస్తుంటారు. ప్రతిజ్ఞలు కూడా చేస్తుంటారు. అలాంటిది మళ్లీ ఆలయంలో భక్తులకు నిషేధం అమలు చేయడం భక్తులకు నిరాశ చెందారు. కానీ కరోనా సమయంలో ఇది తప్పదని అదికారులు చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరుగురు పిల్లలు చూస్తుండగా భార్యను చంపేశాడు..