Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్ని వర్గాల వారికి న్యాయం... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Advertiesment
అన్ని వర్గాల వారికి న్యాయం... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
, సోమవారం, 22 జులై 2019 (08:05 IST)
అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం పని చేస్తుందని, మంత్రివర్గ కూర్పు నుంచి అన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 
 
ఆదివారం హోటల్ ఐలాపురంలో ఏపీ కమ్మర శాలివాహన కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విజయవాడ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలని లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
 
40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు నమ్మి అధికారమిస్తే... అభివృద్ధి చేయకుండా మాటలతో మోసం చేశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.  అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్సార్ సిపి నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, కమ్మర శాలివాహన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
 
కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,  ఎమ్మెల్యే జోగి రమేష్ , ఎన్ వి కృష్ణారావు, బొమ్మిడి శ్రీనివాస్,  దుర్గాప్రసాద్ గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి నాయకులు  వెంకట్రామయ్య, కమ్మర శాలివాహన కృష్ణా జిల్లా, విజయవాడ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్రిగోల్డ్ లాగే ఆదుకోండి: జగన్‌పై కేశవరెడ్డి బాధితుల ఒత్తిడి