Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాడికి అన్నీ తెలుసు... తెలియదనుకోవడం మన అవివేకం.. జగన్‌పై జేసీ కామెంట్స్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. వాడికి (జగన్) అన్నీ తెలుసని, వాడికి ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకమన్నారు.

Advertiesment
JC Diwakar reddy
, ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:44 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. వాడికి (జగన్) అన్నీ తెలుసని, వాడికి ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకమన్నారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో మరోమారు స్పందించారు. 
 
ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ఏం ప్రయోజనమన్నారు. రాష్ట్రపతి ఏం చేస్తారని, కాసిన్ని కాఫీ ఇచ్చి.. పరిశీలిస్తామంటూ చెప్పి పంపుతారని అన్నారు. దీని గురించి ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళితే తగిన సమాధానం లభిస్తుందన్నారు. అన్నీ తెలిసిన పేర్లే అంటూ... ఊరికే వాళ్ల దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే ఏం ప్రయోజనమన్నారు. 
 
మనం దేవుడి దగ్గరకు ఎందుకెళ్తాం... ఆపద్బాంధవా కాపాడు తండ్రీ అని మొక్కోవడానికి వెళ్తామని జేసీ అన్నారు. జగన్ కూడా అంతేనని... తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి కాపాడాలని కోరుకోవడానికే ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి తప్పించండని అడుక్కోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలను ఫూల్స్‌ను చేయొద్దు.. వైఖరి మార్చుకోండి : చైనాకు దలైలామా చురక