Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంగారెడ్డిలో జనసేన సభ.. ఫైర్ అవుతున్న తెరాస... చర్చనీయాంశంగా పవన్ స్టేట్మెంట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చేసిన ప్రకటన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, యువతకు 60 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు.

సంగారెడ్డిలో జనసేన సభ.. ఫైర్ అవుతున్న తెరాస... చర్చనీయాంశంగా పవన్ స్టేట్మెంట్
, బుధవారం, 15 మార్చి 2017 (15:39 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చేసిన ప్రకటన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, యువతకు 60 శాతం సీట్లు కేటాయిస్తామంటూ ప్రకటించారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇపుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
 
ఇటీవ‌ల ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప‌లుసార్లు పవన్ కళ్యాణ్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అంతేగాక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను నిర్వ‌హించిన ప‌లు స‌భ‌ల్లో జగ్గారెడ్డి పేరును కూడా ప‌లుసార్లు ప్రస్తావించారు.
 
ఇక తాను ఏపీలో అనంత‌పురం నుంచి పోటీకి దిగుతాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంనుంచే త‌న రాజ‌కీయ బ‌లాన్ని పెంచుకోవాల‌ని యోచిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మద్దతుతో తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ప‌వ‌న్ తెలంగాణ‌లోనూ పార్టీ బ‌లాన్ని పెంచుకోనున్నార‌ని టాక్‌. 
 
ఇటీవ‌ల ఆ ప్రాంతంలో జ‌రిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు భారీ ఎత్తున వ‌చ్చి ప‌వ‌న్‌ను చూసేందుకు పోటీ ప‌డ్డారు. ఆ జిల్లా కేంద్రంగానే తెలంగాణ‌లో ప‌వ‌న్ త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చుకుంటార‌ని భావిస్తున్నారు. అయితే, పవన్ ప్రకటనపై అధికార తెరాస నేతలు మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి పైకప్పుపై ఎక్కి కూర్చున్న ఎస్‌యూవీ కారు.. ఎలాగో వీడియో చూడండి..