రాజ్యసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. వైకాపా తరపున అధికారికంగా బరిలోకి దించిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి నమ్మినబంటు విజయసాయి రెడ్డిని ఓడించేందుకు వైకాపా నేతలతో పాటు టీడీపీ నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయం టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యల్లో వెల్లడైంది. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా జగన్ ఎంపిక చేసిన విజయసాయి రెడ్డికి తాము ఓటు వేయలేమని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన అనంతరం జలీల్ఖాన్ మీడియాతో మాట్లాడారు. జగన్ సొంత బంధవులకే విజయసాయి ఎంపిక నచ్చలేదని, వారు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు.