Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:41 IST)
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా చెబితే అలా తలాడిస్తున్నారని జగన్ విమర్శించారు. తెలంగాణ రాదు అని చెప్పినప్పటికీ అక్కడి యువత అంతా ఒకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారనీ, అలాంటిది ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన మాటను మన యువత ఎందుకు సాధించుకోదో నిరూపిస్తామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ యువతీయువకులతో కలిసి తమ పార్టీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాని సాధిస్తామన్నారు. అవసరమైతే తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఢిల్లీలో ధర్నా చేస్తారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతదూరమయినా వెళ్తామన్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి సభలో పాల్గొన్న యువతీయువకులకు మైకులిచ్చి... మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమోనంటూ చెప్పారు. యువతీయువకులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చింది.. నాడీ పనిచేయలేదు.. డాక్టర్ రామసీత