Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్ప శ్రీవాణి కూతురిని ఆశీర్వదించిన జగన్‌

పుష్ప శ్రీవాణి కూతురిని ఆశీర్వదించిన జగన్‌
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:15 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్పా శ్రీవాణికి కొద్ది రోజుల కిందట పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.

తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించడంతో మహాలక్ష్మి తమ ఇంట్లో అడుగుపెట్టిందని పుష్ప శ్రీవాణి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

ఈ మేరకు పుష్ప‌ శ్రీవాణి, పరీక్షిత్ ‌రాజు దంపతులు తమ ముద్దుల కూతురితో కలిసి బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.‌

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడారు. పాపకు తన ఆశీస్సులు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022 నాటికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధమే లక్ష్యం: ప్రధాని