Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెయ్యి టిప్పర్ లారీలను కొనుగోలు చేసిన నల్లకుబేరుడు జె.శేఖర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అ

Advertiesment
j sekhar reddy
, సోమవారం, 26 డిశెంబరు 2016 (12:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు జే.శేఖర్ రెడ్డి యేడాదిన్నర కాలంలో వెయ్యి టిప్పర్ల లారీలను కొనుగోలు చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జే.శేఖర్‌ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించకుండా కాలం గడిపిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో చిక్కిన విషయం తెల్సిందే.
 
ఈయనతో పాటు.. ఆయన సన్నిహితులు, కుటుంబీకుల గృహాల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లోనే రూ.181 కోట్ల నగదు, 130 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు జే.శేఖర్ రెడ్డితో పాటు.. ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి బాగోతం బయటపడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాయ్‌పై ఎయిర్‌టెల్ ఫిర్యాదు... డిసెంబర్ 31తో నిలిచిపోనున్న జియో ఉచిత సేవలు!