Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’... విద్యార్థిని సూసైడ్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’... విద్యార్థిని సూసైడ్
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:29 IST)
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హుజూరాబాద్, సైదాపూర్‌ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన చందన పట్టణంలోని ఒక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో పోతరాజు చందన (19) అనే యువతి ఇంటర్మీడియేట్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లిన చందన... క్లాసులు జరుగుతుండగా మధ్యలోనే బయటకు వచ్చి బిల్డింగ్‌పైన గల స్టోరూంకు వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీన్ని కళాశాల యజమాన్యం హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కోటేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. చందన మృతదేహం వద్ద ‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసికందును నోట్లో కరచుకొని వీధిలోకి లాక్కొచ్చిన పందులు