Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు ప్ర‌భుత్వాల్లోనూ గెస్ట్ లెక్ఛ‌ర్ల ఊడిగం: నాదెండ్ల మనోహర్

Advertiesment
రెండు ప్ర‌భుత్వాల్లోనూ గెస్ట్ లెక్ఛ‌ర్ల ఊడిగం: నాదెండ్ల మనోహర్
, శనివారం, 31 జులై 2021 (22:17 IST)
అటు తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో... ఇటు వైసీపీ హ‌యాంలో గెస్ట్ లెక్చ‌రర్లు జీతాలు లేకుండానే, ఊడిగం చేస్తున్నార‌ని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ని ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు క‌లిసి, త‌మ గోడును వెళ్ళ‌బోసుకున్నారు.

గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమ‌ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల అష్ట కష్టాలు ప‌డుతున్నార‌ని మ‌నోహ‌ర్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇప్పుడు జీతాల విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం లేద‌ద‌ని ఆరోపించారు.

గత నాలుగేళ్లుగా గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా పని చేయించుకోవడం అన్యాయమ‌ని, 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వహిస్తున్నార‌ని వివ‌రించారు. గత ప్రభుత్వ హయం నుంచి ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే, ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోంద‌ని విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే బకాయిపడ్డ వేతాలు ఇవ్వాల‌ని, లేని పక్షంలో జనసేన పార్టీ కచ్చితంగా వీరికి అండగా ఉంటుంద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాబోయే ఆరు నెలల్లో రెసిడెన్షియల్‌ రియాల్టీ కన్స్యూమర్‌ దృక్పథం ఆశాజనకంగా ఉంది