ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల వాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
నిజానికి గత కొన్ని రోజులుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పగటిపూట ప్రజలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఇంటువంటి సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
శని, అది, సమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులుసైతం పడతాయని అంచనా వేసింది.
మరోవైపు, నంద్యాల జిల్లా దొర్నిపాడులో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో 40.2, కర్నూలు జిల్లా లద్దగిరిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతుల నమోదయ్యాయి. కాగా, 30 మండలాల్లో వడగాలులు వీచాయి. అదే విధంగా వేసవి ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులు పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు.