Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్నిపథ్ మూలాల వేట కోసం నరసారావు పేటకు వచ్చిన ఐటీ - ఐటీ బృందాలు

agnipath
, సోమవారం, 20 జూన్ 2022 (16:10 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన హింసాకాండకు మూలాలు గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చే వేధింగా ఇక్కడ సాయి డిఫెన్స్ అకాడెమీ నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో అకాడెమీలో తనిఖీల కోసం నరసారావుపేటకు ఐటీ, ఐబీ అధికారుల బృందాలు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా నరసారావు పేటలో ఉన్న సాయి డిఫెన్స్ అకాడెమీలో వారు తనిఖీలు చేశారు. 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసారావుపేట కేంద్రమని పోలీసులు తేల్చారు. దంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇక్కడకు చేరుకుని పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వెళ్లారు. 
 
అక్కడ వారు అకాడెమీ రికార్డులను నిశితంగా పరిశీలించారు. అకాడెమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా అకాడెమీలో పని చేసే సిబ్బందిని కూడా ఐటీ, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై యువకుడి అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి..