Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌

ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌
, బుధవారం, 17 జులై 2019 (08:35 IST)
కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిని డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
2009 బ్యాచ్‌కు చెందిన రోహిణి ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లికి చెందినవారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న రోహిణి.. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
ముక్కుసూటిగా వెళ్తారనే పేరున్న ఆమె.. తన సర్వీసులో అనేక సార్లు బదిలీ అయ్యారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌, మరోసారి హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె బదిలీలకు బ్రేక్‌ పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం.. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ టీం