Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొరుగింటి మైనర్ కవలలపై తండ్రీ కొడుకుల అత్యాచారం.. హైదరాబాదులో దారుణం

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయ్. కామంతో కామాంధులు విరుచుకుపడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రీకొడుకులు కలిసి తన పొరిగింట్లో ఉంటున్న మైనర్ కవలలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచ

Advertiesment
Hyderabad
, శుక్రవారం, 4 నవంబరు 2016 (09:18 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయ్. కామంతో కామాంధులు విరుచుకుపడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రీకొడుకులు కలిసి తన పొరిగింట్లో ఉంటున్న మైనర్ కవలలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగర శివార్లలోని  మైలార్ దేవపల్లికి నేపాల్‌కు చెందిన ఓ కుటుంబం వలస వచ్చి ఉంటోంది. వారికి మైనర్ కవల సోదరీమణులున్నారు. 
 
పొరుగింట్లో నివాసం ఉంటున్న జాఫర్ తన 16 ఏళ్ల కొడుకు కలిసి ఆ మైనర్ కవల సోదరీమణులపై ఏడాది కాలంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దురాగతానికి బాధిత బాలికల కుటుంబసభ్యుడొకరు సహకరించాడని పోలీసుల విచారణ దర్యాప్తులో వెల్లడైంది. ఇంత దారుణం జరిగినా పోలీసులు నిందితులైన తండ్రీకొడుకులను ఇంకా అరెస్టు చేయలేకపోవడంతో మహిళా, బాలల సంఘాలు ఫైర్ అవుతున్నాయి. 
 
ఇదిలా ఉంటే, దొంగతనం నెపంతో మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన మేడ్చల్‌లోని శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్త, మరిదిపై గృహహింస చట్టం కింద పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలి : నరేంద్ర మోడీ