Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమెకు రెండో పెళ్ళై రెండు నెలలే.. భర్త కళ్లముందే.. గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

మహిళలకు, బాలికలకు భద్రత రోజురోజుకీ కరువైంది. ఒంటరిగానే కాదు.. తండ్రితో, భర్తతో కలిసి వెళ్లినా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా భర్తతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జ

ఆమెకు రెండో పెళ్ళై రెండు నెలలే.. భర్త కళ్లముందే.. గ్యాంగ్ రేప్.. ఎక్కడ?
, బుధవారం, 16 ఆగస్టు 2017 (12:19 IST)
మహిళలకు, బాలికలకు భద్రత రోజురోజుకీ కరువైంది. ఒంటరిగానే కాదు.. తండ్రితో, భర్తతో కలిసి వెళ్లినా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి.  తాజాగా భర్తతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం నగర శివారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ సామూహిక లైంగికదాడికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
దుందిగల్- గండిమైసమ్మ చౌరస్తాకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి గత ఆదివారం షాపూర్‌నగర్‌కు వెళ్లింది. తిరిగి అదే రోజు రాత్రి ఏడు గంటలకు వెళ్తుండగా మధ్యలో నలుగురు వ్యక్తులు అడ్డగించారు. వారిద్దరినీ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఎక్కించుకుని హెచ్‌ఎంటీ టౌన్‌షిప్‌లోని అర్బన్ ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లారు.
 
తర్వాత భర్తను బంధించి.. ఆతని కంటి ముందే ఒకరి తర్వాత మరొకరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. రేపిస్టులు బెదిరించినా అత్యాచార బాధితురాలు భర్త, స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలు తొలి భర్తకు దూరంగా వుందని.. రెండు నెలల క్రితమే రెండో వివాహం చేసుకుందని.. ఆమెకు ఓ సంతానం వుందని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ తగాదాలు.. అన్నయ్యను కొడ్డలితో నరికేసిన చెల్లెమ్మ