Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాడైన అరటిపండును డస్ట్‌బిన్‌లో వేయలేదనీ... టీసీఎస్ టెక్కీ ఏం చేశాడో తెలుసా?

ఇంట్లో పాడైన అరటిపండును చూసిన టెక్కీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే ఒక్కసారి భార్యపై ఒంటికాలిపై లేచాడు. భోజనం చేస్తుందన్న విచక్షణ కూడా లేకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. భోజనం ప్లేట్‌ను తీసుని

Advertiesment
Hyderabad
, గురువారం, 17 ఆగస్టు 2017 (15:05 IST)
ఇంట్లో పాడైన అరటిపండును చూసిన టెక్కీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే ఒక్కసారి భార్యపై ఒంటికాలిపై లేచాడు. భోజనం చేస్తుందన్న విచక్షణ కూడా లేకుండా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. భోజనం ప్లేట్‌ను తీసుని ముఖ్యంపై కొట్టాడు. అప్పటికీ కసితీరక పోవడంతో కిందపడేసి గొంతుపై కాలేసి తొక్కాడు. దీంతో మహిళ స్పృహ కోల్పోవడంతో ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్, మియాపూర్‌లో జరిగింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన పుష్పశ్రీకి, విజయవాడకు చెందిన బ్రహ్మేశ్వర రావుకు ఐదేళ్ల కిందట వివాహమైంది. బ్రహ్మేశ్వర రావు హైదరాబాద్‌లోని టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే పెళ్లిన మరుసటి నెల నుంచే భార్యను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన బ్రహ్మేశ్వర రావు పండ్ల ట్రేలో పాడైన ఒక అరటిపండును చూశాడు. చెడిపోయిన పండును పడేయకుండా ఇంకా ట్రేలో ఎందుకు ఉంచావంటూ భార్యను పట్టుకుని చితకబాదాడు. నానా యాగిరి చేశాడు. ఎదురింటివారు ఈ విషయంపై బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతోవారు అక్కడకు వచ్చిన పుష్పశ్రీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కిరాతక భర్త కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపులకు రిజర్వేషన్లు ఇప్పట్లో లేనట్లే.. ముద్రగడ ఏం చేస్తారు?