Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రైవేట్ ట్రస్టులకు తితిదే నిధులా? హైకోర్టు సీరియస్.. ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం రూ.50లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ నుంచి రూ.50లక్షలు కేటాయించాలనే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్పందించింది. నిధులను ప్రై

Advertiesment
Hyderabad
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (11:06 IST)
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం రూ.50లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ నుంచి రూ.50లక్షలు కేటాయించాలనే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్పందించింది. నిధులను ప్రైవేట్ ట్రస్టులకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. చట్టవిరుద్ధమైన నిర్ణయమని ఆక్షేపిస్తూ నిధుల విడుదల ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
 
మరోవైపు తితిదే నిధుల కేటాయింపు వివాదాస్పదమైంది. ధర్మ ప్రచారం పేరుతో ఏటా దాదాపు కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. హిందూ ప్రచార ధర్మ పరిషత్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న టీటీడీ, ప్రైవేటు ట్రస్టులకు కోట్లాది రూపాయలు కేటాయించడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనివల్ల ఏటా కోట్లాది రూపాయలు ప్రైవేటు ట్రస్టులకు కేటాయించడాన్ని తప్పుబట్టి నిరసనలు చేపట్టారు. 
 
ఈ నిధుల కేటాయింపును వ్యతిరేకిస్తూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఏపీ రెవిన్యూ ముఖ్య కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్‌కు, టీటీడీ ఈవోతోపాటు హిందూ పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకన్న వద్ద రూ.20 కోట్ల ఓల్డ్ కరెన్సీ.. స్వామివారిని అరెస్టు చేస్తారా? భక్తుల సెటైర్లు