Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నడిరోడ్డుపై బైక్ ఆపేసి పరిగెత్తిన భర్త.. అవాక్కైన భార్య.. ఎందుకు?

నడిరోడ్డుపై బైక్ ఆపేసి పరిగెత్తిన భర్త.. అవాక్కైన భార్య.. ఎందుకు?
, ఆదివారం, 10 జనవరి 2021 (18:45 IST)
పోలీసులను చూసి బైక్ ఆపేసి భర్త పారిపోయాడు. భార్యకు సిటీలో ఇంటి అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో అక్కడే ఏడుస్తూ కూర్చుంది. పోలీసులు వివరాలు సేకరించి క్షేమంగా అప్పగించారు.
 
భార్యను బైక్‌పై ఎక్కించుకుని వస్తున్న భర్త ఉన్నట్టుండి బండి ఆపేశాడు. అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. ఎందుకు పారిపోతున్నాడో తెలియని భార్య షాక్‌కి గురైంది. నడిరోడ్డుపై నిల్చుండిపోయింది. భర్త రాకపోవడంతో ఏడుస్తూ కూర్చున్న భార్యని గమనించిన పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్తని పిలిపించి భద్రంగా అప్పజెప్పారు. ఈ షాకింగ్ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
 
శంషాబాద్ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ చేస్తుండటంతో అటువైపుగా బైక్‌పై వస్తున్న రాజు సడెన్‌గా బండి ఆపేశాడు. భార్య సీతను నడిరోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. భర్త ఎందుకు పారిపోతున్నాడో తెలియని ఆమె షాక్‌కి గురైంది. 
 
అయితే ఆమెకు ఇంటి అడ్రస్ కూడా సరిగ్గా తెలియకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే నిలుచుండిపోయింది. కొద్దిసేపటికి పక్కనే ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోకి వెళ్లి కూర్చుంది. అక్కడ ఏడుస్తూ కూర్చున్న సీతని ఎయిర్‌పోర్ట్ మొబైల్ పోలీసులు గమనించారు. ఆమెను స్టేషన్‌కి తీసుకెళ్లి ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. భర్త రాజును పిలిపించి భార్యను భద్రంగా అప్పజెప్పారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోతానన్న భయంతోనే రాజు పారిపోయాడట! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ రెడ్డి మౌనం వల్లే దేవాలయాలపై దాడులు : అచ్చెన్నాయుడు