Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

షార్ట్ ఫిల్మ్ తీయాల‌ని కెమెరాలు తెప్పించి... బెజ‌వాడ కేటుగాళ్ళు!

Advertiesment
hyderabad
విజ‌య‌వాడ‌ , గురువారం, 16 డిశెంబరు 2021 (15:14 IST)
విజయవాడలో ఘరానా మోసం జ‌రిగింది. షార్ట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాదు నుండి  కెమెరాలను విజయవాడ పిలిపించిన కేటుగాళ్లు చివ‌రికి ఆ కెమెరాల‌తో ఉడాయించారు. హైదరాబాదు కమలాపురి కాలనీ నుండి కెమెరాలతో విజయవాడ వచ్చిన కెమెరామెన్ కేతవత్ దీనితో హ‌తాశుడయ్యాడు. 
 
ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కెమెరాలతో కేతవత్ ను బస్టాండ్ నుండి బందర్ రోడ్డులోని ఓ హోటల్ కు తీసుకువెళ్ళారు. కెమెరామెన్ ను భోజనానికి పంపి హోటల్ నుండి 20 లక్షల కెమెరాలతో ఉడాయించారు. 
ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని పోలీసులకు బాదితుడు కేతవత్ ఫిర్యాదు చేశాడు. 
 
విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన  బాధితుడు త‌న కెమేరాలు ఇప్పించాల‌ని వేడుకుంటున్నాడు. కేసు నమోదు చేసి హోటల్ లోని సీసీఫుటేజ్ అధారంగా కేసును గవర్నర్ పేట పోలీసులు  ధర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా నేరాలు జరిగాయని చెబుతున్న బాధితులు, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబ్జెక్టు లేని సీఎం దెబ్బకు హెచ్ఎస్‌బీసీ మూతపడింది : నారా లోకేశ్